TS: చార్జీలను సవరించిన ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చార్జీలను సవరించింది. పల్లె వెలుగు బస్సు టికెట్ ధరలను రౌండప్ చేశారు. ముఖ్యంగా చిల్లర సమస్య నివారణలోభాగంగా ఈ టికెట్ ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రూ. 12 టికెట్ ధరను రూ. 10లకు తగ్గిస్తూ… రూ. 13 లేదా రూ. 14 ఉన్న చార్జీని రూ. 15 చేశారు. అలాగే 80 కి.మీ. దూరానికి ఇపుడు ఉన్న రూ. 67ల చార్జీని రూ. 65కు తగ్గించారు. అలాగే టోల్ప్లాజా కోసం టికెట్పై వసూలు చేస్తున్న చార్జీని ఆర్డినరీ బస్సుకు మరో రూపాయి అదనంగా వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్ ధరకు అదనంగా రూ. 2 చొప్పున వసూలు చేస్తారు.