For Money

Business News

హై రిస్క్‌ తీసుకునేవారికి…

అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు మూడు షేర్లను ప్రతిపాదించారు స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు. ప్రముఖ అనలిస్ట్‌ కునాల్ బోత్రా విప్రో, జీఎన్‌ఎఫ్‌సీ షేర్లను సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుత ధర వద్ద విప్రోను కొనుగోలు చేయొచ్చని… రూ.456 స్టాప్‌లాస్తో రూ. 488 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని సూచించారు. అలాగే జీఎన్‌ఎఫ్‌సీ షేర్‌ను రూ. 640 స్టాప్‌లాస్‌తో రూ. 700 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని సలహా ఇచ్చారు. మరో అనలిస్ట్‌ నూరేష్‌ మాత్రం డీఎస్‌బీ బ్యాంక్‌ను సిఫారసు చేస్తున్నారు. రూ.78 స్టాప్‌లాస్‌తో రూ.100 టార్గెట్‌తో కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. తక్కువ రిస్క్‌ తీసుకునేవారికి మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ను నూరేష్‌ సిఫారసు చేస్తున్నారు. రూ. 900 స్టాప్‌లాస్‌తో రూ. 1050 టార్గెట్‌ కోసం కొనేందుకు సలహా ఇస్తున్నారు. ఒక మోస్తరు రిస్క్‌ ఇష్టపడే వారు మారుతీ సుజుకీ షేర్‌ను రూ. 7720 స్టాప్‌లాస్‌తో రూ.8300 టార్గెట్‌ కోసం కొనొచ్చని కునాల్ బోత్రా సిఫారసు చేస్తున్నారు.