For Money

Business News

3 కోట్ల మంది రైల్వే ప్రయాణికుల డేటా చోరీ

 

ఎయిమ్స్‌ సర్వర్‌ డేటా చోరీ ఇంకా మరవకముందు ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో నమోదైన సుమారు 3 కోట్ల మంది ప్రయాణికుల పేర్లు, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, చిరునామా, వయసు, జెండర్‌, ట్రావెల్‌ హిస్టరీ వంటి వివరాలను హ్యాక్‌ చేసినట్లు సమాచారం. ఈ డేటాను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచారని కూడా తెలుస్తోంది. షాడో హ్యాకర్‌ అనే పేరుతో డిసెంబరు 27న ప్రయాణికుల వివరాలను హ్యాక్‌ చేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఐఆర్‌సీటీసీ మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ సర్వర్ల నుంచి డేటా హ్యాక్‌ కాలేదని పేర్కొంది. చోరీ అయిన డేటాతో శాంపిల్‌గా తమ డేటాతో సరిపోల్చామని… కాని అది తమ సర్వర్ల నుంచి హ్యాక్‌ చేసిన డేటా కాదని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. అయితే తమ కంపెనీకి పలు పార్టనర్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయని… వాటిని కూడా చోరీ అయిన డేటాతో చెక్‌ చేయాల్సిందిగా కోరినట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.