For Money

Business News

ఏపీలో సన్‌ ఫార్మా యూనిట్‌

ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన సన్‌ ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత దిలీప్‌ సంఘ్వీ నిన్న సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఫార్మా రంగ ప్రగతి, సన్‌ ఫార్మా తయారీ యూనిట్‌ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సహకాల గురించి సీఎం వారికి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలనూ సీఎం తెలిపారు. అనంతరం దిలీప్‌ సంఘ్వీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు.. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారు. సన్‌ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను రాష్ట్రంలో నెలకొల్పుతాం. ఔషధ రంగంలో మా ఆలోచనలను ముఖ్యమంత్రితో పంచుకున్నాం. ఇంటిగ్రేటెడ్‌ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నాం. ఇక్కడినుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది లక్ష్యాల్లో భాగం’ అని అన్నారు.