For Money

Business News

బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ ఆస్తులు జప్తు

తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్​ నేసమణిమారన్​ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్​ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద మారన్‌కు చెందిన రూ.293.91 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు భారతీయ కంపెనీలైన సదరన్ అగ్రిఫ్యూరేన్​ ఇండస్ట్రీస్​ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ ట్రాన్స్​పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్​, ఎంజీఎమ్​ ఎంటర్​టైన్​మెంట్​ ప్రైవేట్​ లిమిటెడ్, ఎంజీఎం డైమండ్ బీచ్ రీసార్ట్​ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్ల రూపంలో ఉన్నాయని ఈడీ తెలిపింది. ఈ షేర్లను జప్తు చేసింది. 2005-06, 2006-07 ఆర్థిక సంవత్సరంలో సింగపుర్​లోని సంస్థల్లో రూ.293.91 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది.