For Money

Business News

అశోకా బిల్డర్స్‌ భారీ డీల్

హైదరాబాద్‌కు చెందిన అశోకా బిల్డర్స్‌ రూ.235 కోట్లు వెచ్చించి కూకట్‌పల్లిలో 10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఓ దిగ్గజ కార్పొరేట్‌ సంస్థకు చెందిన ఈ స్థలాన్ని విక్రయానికి పెట్టగా, అశోకా బిల్డర్స్‌ అధిక మొత్తాన్ని చెల్లించటానికి ముందుకు వచ్చినట్లు, తద్వారా ఈ ఆస్తిని సొంతం చేసుకున్నట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ వివరించింది. ఈ స్థలంలో ప్రీమియం నివాస గృహాలు, గ్రేడ్‌-ఏ వాణిజ్య స్థలాన్ని నిర్మిస్తామని, 2025 జూన్‌ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనేది లక్ష్యమని అశోకా బిల్డర్స్‌ సీఈఓ అజితేష్‌ కొరుపోలు తెలిపారు. దీనిపై మరో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టి, రూ.600 కోట్ల ప్రాజెక్టు విలువను సాధించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.