For Money

Business News

రూ. 250 కోట్లతో స్టెంట్ల ప్లాంట్‌

ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్‌3వీ వాస్కులర్‌ టెక్నాలజీస్‌ హైదరాబాద్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కులో రూ.250కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నరాలు, గుండె చికిత్సకు సంబంధించి డ్రగ్‌ ఎలుటింగ్‌ స్టెంట్‌ను ఈ కంపెనీ తయారు చేస్తుంది. నికిల్‌, కోబాల్ట్‌ అలెర్జెనిక్‌ అయాన్‌లు లేని మిశ్రమం నుంచి తయారుచేసే మొట్టమొదటి స్టెంట్‌ ఇది కావడం విశేషం. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) పూర్వ విద్యార్థులు ఎస్‌3వీ వాస్కులర్‌ టెక్నాలజీస్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీకి మైసూరులో ఆర్‌అండ్‌డీ సెంటర్‌, పైలట్‌ తయారీ ప్లాంటు ఉన్నాయి.