For Money

Business News

5జీ ఫోన్‌ ధర రూ.12,000లోపే!

అక్టోబర్‌ 1వ తేదీన 5జీ సర్వీసులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీంతో మార్కెట్లో ఉన్న రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు అందించే సేవలు, చార్జీల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రిలయన్స్ జియో నుంచి 5జీ ఫోన్ కూడా రానుంది. ఈ ఫోన్‌ ధర గురించి మార్కెట్‌లో చాలా ఆసక్తి ఉంది. జియో 5జీ ఫోన్ ధర రూ.12 వేల కంటే తక్కువగా ఉండొచ్చని మార్కెట్‌ వదంతులు ఉన్నాయి. డేటా అనలిటిక్స్ సంస్థ ‘కౌంటర్‌పాయింట్’ జియో 5 జీ ఫోన్‌ ధర గురించి రాస్తూ రూ.8 వేల నుంచి రూ. 12000 లోపు ఉండొచ్చని పేర్కొంది. అయితే ఈ వార్తను సదరు సంస్థ తొలగించినా… ఆన్‌లైన్‌లో తిరుగుతోంది. కౌంటర్‌ పాయింట్‌ ఒరిజినల్ రిపోర్టుని ప్రస్తావిస్తూ.. జియో 5జీ ఫోన్ ధర రూ.8,000 నుంచి రూ.12,000 మధ్య ఉండొచ్చని ఎకనామిక్ టైమ్స్ పత్రిక కూడా పేర్కొంది. కచ్చిత ధర తెలియకున్నా… రిలయన్స్‌ మాత్రం తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి తెస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.