For Money

Business News

ఉద్యోగులకు రూ. 1,500 కోట్ల నజరానా

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం పూర్తయింది. రెండు సంస్థల విలీనం తరవాత బ్యాంక్‌ పనితీరును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటిస్తోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఫలితాలను శనివారం బ్యాంక్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు వన్‌ టైమ్‌ ఎక్స్‌ గ్రేషియను ప్రకటించింది. రెండు సంస్థల విలీనం సమయంలో ఎంతో శ్రమించిన తన ఉద్యోగులకు రూ. 1,500 కోట్ల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. యువ ఉద్యోగులను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అయిన శశిధర్‌ జగదీశన్‌ వెల్లడించారు.

Leave a Reply