For Money

Business News

ఇక ఫుల్‌ కెపాసిటీతో విమానాలు

కరోనా కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటి వరకు దేశీయ విమానయాన రంగంపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. దీంతో విమానాలను ఇక నుంచి ఫుల్‌ కెపాసిటీతో నడపవచ్చు. ఈనెల 18వ తేదీ నుంచి కెపాసిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.2020 మే నుంచి దేశీయంగా తిరిగే విమానాలపై ఆంక్షలు విధించారు. పండుగల సమయంలో ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.