For Money

Business News

దీపావళి నుంచి జియో 5జీ…

వచ్చే దీపావళి నుంచి జియో 5జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయని రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించారు. కంపెనీ 45వ ఏజీఎంలో ఆయన మాట్లాడుతూ… దీపావళి నుంచి నాలుగు మెట్రో న‌గ‌రాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో 5జీ సేవ‌లను ప్రారంభిస్తామని అన్నారు. తరవాత ఇతర నగరాలకు, పట్ణాలకు విస్తరిస్తామన్నారు. వచ్చే ఏడాది డిసెంబ‌ర్ కల్లా 5జీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. జియో ద్వారా డిజిట‌ల్ క‌నెక్టివిటీ పెరుగుతోంద‌ని, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో జియో దూసుకువెళ్తోంద‌ని అన్నారు. 5జీతో సుమారు పది కోట్ల గృహాలకు ఇంటర్‌నెట్‌ అందిస్తామని అన్నారు. మేడిన్‌ ఇండియా 5జీ నెట్‌ వర్క్‌ వినియోగంలోకి తెచ్చేందుకు మెటా, గూగుల్‌,మైక్రోసాఫ్ట్‌, ఎరిక్సిన్‌, నోకియా, శాంసంగ్‌, సిస్కో, క్వాల్కంతో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పారు.