For Money

Business News

2 గంటలకు ఆర్బీఐ ప్రకటన

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓ ప్రకటన చేస్తారని ఆర్బీఐ తెలిపింది. ఆకస్మికంగా వెల్లడించిన ఈ ప్రకటనలో ఏం ఉండబోతోందని అంశంపై మార్కెట్‌ చర్చ జరుగుతోంది. ఆర్బీఐ నుంచి ఈ ప్రకటన వచ్చిన తరవాత బాండ్లపై ఈల్డ్‌ పెరగడం గమనార్హం. వచ్చే నెలలో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచుతుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆకస్మిక మీడియా సమావేశంపై స్టాక్‌ మార్కెట్‌ ఆసక్తితో ఉంది. ముఖ్యంగా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం రోజున ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ ఇలా అత్యవసరంగా ప్రకటన చేసేంత పరిస్థితి లేదని బిజినెస్‌ ఛానల్స్‌ అంటున్నాయి.