For Money

Business News

మన కరెన్సీపై లక్ష్మీ, గణేష్‌ బొమ్మ ముద్రించండి

మనదేశ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణేష్‌ బొమ్మలు ముద్రిస్తే దేశం బాగుపడుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. కొత్తగా ముద్రించే నోట్లపై ఇక నుంచి ఈ బొమ్మలు ముద్రించేలా చూడాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదనను కేజ్రివాల్‌ ముందుకు తెచ్చారు. కొత్త నోట్లపై మహాత్మగాంధీ బొమ్మతో పాటు లక్ష్మీదేవి, గణేష్‌ బొమ్మలు ముద్రించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. గణేష్‌ బొమ్మతో ఇండోనేషియా ప్రభుత్వం కరెన్సీ నోట్లను ముద్రిస్తోందని… మనం కూడా చేయొచ్చని ఆయన అన్నారు. ఒకట్రెండు రోజుల్లో తాను కేంద్రానికి ఈ విషయమై లేఖ రాస్తానని ఆయన అన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితి బాగుపర్చేందుకు మనవంతు ప్రయత్నం చేయడంతో పాటు దేవుని అనుగ్రహం కూడా అవసరమని అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు.