For Money

Business News

ఫార్మాకు షాక్‌ తప్పదా?

రెండు వారాల్లో ఫార్మా సుంకాలు ప్రకటిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. సంవత్సరాల తరబడి విదేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడం తమ దేశానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. దీనికి విరుగుడుగా దేశీయంగా భారీగా ఔషధాల తయారీ చేపట్టాలని ఆయన అంటున్నారు. దేశీయంగా అమెరికా ఫార్మా యూనిట్లు నెలకొల్పేందుకు పలు రాయితీలు కల్పిస్తూ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు కొత్త యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు పదేళ్ళు పడుతోందని ఆయన అన్నారు. దీంతో విధానపరమైన పలు నిబంధనలను సడలించారు. కొత్త యూనిట్లు నెలకొల్పితే రాయితీలు ఇస్తామని ట్రంప్‌ అన్నారు. భారత్‌ వంటి దేశాల్లోని ఫార్మా యూనిట్ల పరిశీలన మరింత భారం కానుంది. ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్షన్‌ ఫీజులు కూడా భారీగా పెరగనున్నాయి. ఇక నుంచి మళ్ళీ మళ్ళీ ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్షన్లు చేయాలని ఎఫ్‌డీఏ అంటోంది. అలాగే ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.