For Money

Business News

జపాన్‌ సంస్థ చేతికి ఎస్‌ బ్యాంక్‌?

మన బ్యాంకింగ్ రంగంలో మరో మెగా డీల్‌కు రంగం సిద్ధమైంది. ఎస్‌ బ్యాంక్‌లో జపాన్‌కు చెందిన ఫైనాన్స్‌ సంస్థ సుమితొమొ మిత్సుయి 51 శాతం వాటా కోసం దరఖాస్తు చేసుకుంది. జపాన్‌ కంపెనీ ప్రతిపాదనకు ఆర్బీఐ అనుమతి ఇచ్చినట్లు మింట్‌ పత్రిక పేర్కొంది. జపాన్‌లోని అతి పెద్ద ఫైనాన్స్‌ కంపెనీల్లో సుమితొమొ ఒకటి. ఆర్బీఐ అనుమతి లభించి టేకోవర్‌ పూర్తయితే… మొత్తం డీల్‌ విలువ సుమారు రూ. 15,000 కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది.
మరో 26 శాతం వాటా కోసం జపాన్‌ కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ చేసే అవకాశముంది. ఇపుడు ఎస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐకి 24 శాతం వాటా ఉంది. ఇతర వాటాదారుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ ఉన్నాయి. ఇవాళ మార్కెట్‌లో ఎస్‌ బ్యాంక్‌ షేర్‌పై జపాన్‌ డీల్‌ ఎఫెక్ట్ ఉండే అవకాశముంది.