For Money

Business News

ఆదుకున్న అదానీ షేర్లు

ఇవాళ స్టాక్ మార్కెట్‌ను అదానీ షేర్లు ఆదుకున్నాయి. ముఖ్యంగా నిఫ్టి ప్రధాన షేర్లయి అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ఇవాళ ఏడు శాతంపైగా పెరిగాయి. అమెరికాలో తమపై నమోదైన కేసును మూసివేసేందుకు ట్రంప్‌ వర్గంతో అదానీ టీమ్‌ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ గ్రూప్‌ షేర్లు పెరిగాయి. దీనికి తోడు శ్రీరామ్‌ పైనాన్స్‌, ట్రెంట్‌ తోడు అవడంతో నిఫ్టి ఇవాళ 114 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టి 24461 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బీఐ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ రెడ్‌లో ముగిసింది. అయితే మిగిలిన ప్రధాన సూచీలన్నీ గ్రీన్‌లో ముగిశాయి. అలాగే ఇవాళ 2984 షేర్లు ట్రేడవగా, 2023 షేర్లు గ్రీన్‌లో క్లోజ్‌ కావడం విశేషం. ఇవాళ నిఫ్టిలో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ టాప్‌ గెయినర్‌ కాగా, తరువాతి స్థానాల్లో అదానీ పోర్ట్స్‌, ట్రెంట్స్‌, శ్రీరామ్‌ పైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో కొటక్‌ బ్యాంక్‌ టాప్‌లో ఉంది. తరువాతి స్థానంలో JSW స్టీల్‌, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, టైటాన్‌ షేర్లు ఉన్నాయి.