For Money

Business News

జోరుగా పెట్రో బాదుడు

ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరను 80 పైసులు పెంచడంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటరు రూ. 118.57కు, డీజిల్‌ రూ. 104.06కు చేరింది. ఢిల్లీలోపెట్రోల్‌ రూ.104.61, డీజిల్‌ రూ. 95.87కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ 84 పైసలు పెరిగి రూ. 119.67కు చేరగా, డీజిల్‌ 85 పైసలు పెరిగి రూ.103.92కు చేరింది.