For Money

Business News

నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌

నీతి ఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా కేంద్ర ప్రభుత్వం పరమేశ్వరన్‌ అయ్యర్‌ను నియమించింది. ఆయన ప్రస్తుతం స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు నేతృత్వం వహింస్తున్నారు. 1981 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన అయ్యర్‌ 2009లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ప్రపంచ బ్యాంకులో చేరారు. అక్కడ నీరు, పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను చూశారు. 2016లో ఆయన తిరిగి భారత్‌కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను స్వచ్ఛ భారత్‌ మిషన్‌ హెడ్‌గా నియమించింది.