For Money

Business News

ఈడీ ఎదుట పూరి జగన్నాథ్‌, చార్మి

లైగర్‌ సినిమా నిర్మాణ వ్యవహారాలపై ఆ చిత్ర దర్శక నిర్మాతలైన పూరి జగన్నాథ్‌, చార్మిలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌ డైరెక్టర్‌ కాగా, నిర్మాతల్లో చార్మి కూడా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా విదేశాల్లో కూడా షూటింగ్‌ నిర్వహించారు. ఈ చిత్ర నిర్మాణంలో విదేశీ పెట్టుబడులపై వీరిద్దరిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఈ విచారణ సాగుతోంది. ఇవాళ్టి విచారణకు సంబంధించి 15 రోజుల క్రితమే పూరి, చర్మీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. లైగర్‌ సినిమాలో పలువురు రాజకీయ నేతలు కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఇటీవల విడుదలైన లైగర్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే.