2023 పిక్స్: ఈ షేర్లపై నొమురా నజర్
కొత్త ఏడాది వచ్చేస్తోంది. దీపావళి ధమాకా తరవాత 2023లో రాణించే షేర్ల జాబితాతో షేర్ బ్రోకింగ్, రీసెర్చి సంస్థలు రెడీ అవుతున్నాయి. తాజాగా నొమురా సంస్థ 2023లో మన మార్కెట్ పరిస్థితి, రాణించే షేర్లపై తన అధ్యయనాన్ని వెల్లడించింది. 2023లో స్టాక్ మార్కెట్ నుంచి ప్రతిఫలాలు గొప్పగా ఉండవని తేల్చింది నొమురా. దేశీయ కంపెనీలకే ప్రాధాన్యం ఇచ్చింది. 2023లో నిఫ్టి 19030 పాయింట్లను చేరుకుంటుందని లక్ష్యంగా పేర్కొంది. చాలా కంపెనీల ఫలితాలు సింగిల్ డిజిటల్లో ఉంటాయని తెలిపింది. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ రాణించే అవకాశమున్నా… అధిక వ్యాల్యూయేషన్ ప్రతిబంధకమని తేల్చింది. బ్యాంక్స్, కన్జూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫ్రా, కన్స్ట్రక్షన్ కంపెనీల షేర్లు రాణించే అవకాశముందని పేర్కొంది.
ఇక 2023 ఏడాదికి నొమురా టాప్ పిక్స్ ఇవి… ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హెచ్యూఎల్, కేఈసీ ఇంటర్నేషనల్, మెడ్ప్లస్, ఐజీఎల్ షేర్లు.