For Money

Business News

బీసీసీఐకి రూ. 450 కోట్ల బైజూ షాక్‌?

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎడుటెక్‌ కంపెనీ బైజా క్రికెట్‌ స్పాన్సర్‌షిప్‌కు గుడ్‌ బై చెప్పనుంది. ఇక నుంచి తాను స్సాన్సర్‌షిప్‌ చేయలేనని బైజా కంపెనీ ఇప్పటికే బీసీసీఐకి వర్తమానం పంపినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. టీమిండియా జెర్సీలను బైజూ స్పాన్సర్‌ చేస్తోంది. ఈ స్పాన్సర్‌షిప్‌ డీల్ విలువ 5.5 కోట్ల డాలర్లు అంటే రూ. 450 కోట్ల పైనే. 2023 మార్చి వరకు తాము స్పాన్సర్‌ కొనసాగించగలమని… ఆ తరవాత సాధ్యం కాదని బీసీసీఐకి బైజూస్‌ వెల్లడించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బైజా తన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా క్రికెట్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించింది.