నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ ఒక్కటే అర శాతంపైగా లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ నామ మాత్రపు నష్టాలతో ముగిసింది. కాని నాస్డాక్ ఏకంగా 1.3 శాతం నష్టంతో ముగిసింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ స్థిరంగా ఉంది. ఇక క్రూడ్ 80 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. ఇక ఆసియా మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. గ్రీన్లో ఉన్న మార్కెట్లు నామమాత్రపు లాభాలకే పరిమితమయ్యాయి. నష్టాల విషయానికొస్తే దాదాపు అన్ని చైనా సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఇక హాంగ్సెంగ్ మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. తాజా వార్తల ప్రకారం ఈ సూచీ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి కూడా దాదాపు అర శాతం నష్టంతో ఉంది. సో.. నిఫ్టి రెడ్లో ప్రారంభం కానుంది.