For Money

Business News

స్థిరంగా ప్రారంభమై నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 16240ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16205 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 5 పాయింట్ల నష్టంతో ఉంది. ఇతర సూచీల్లో కూడా పెద్ద మార్పు లేదు. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఓఎన్‌జీసీ, నెస్లే, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, ఎం అండ్ ఎం షేర్లు ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో హిందుస్థాన్ లీవర్‌, దివీస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, టీసీఎస్‌ ఉన్నాయి. జొమాటొ నష్టాలు మూడు రెట్లు పెరిగినా షేర్‌ 4.5 శాతం లాభంతో రూ. 59.65కు చేరింది. నిన్న భారీగా లాభపడిన అశోక్‌ లేల్యాండ్‌ ఇవాళ కూడా రెండు శాతంపైగా లాభపడింది. అమెరికా ఫ్యూచర్స్‌తో పాటు ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. మరి యూరప్‌ మార్కెట్లు ఎలా ఓపెన్‌ అవుతాయో చూడాలి.