For Money

Business News

16,750పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 167,62 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం అదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 156 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టి 35,778 వద్ద 409 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అలాగే మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా ఒకశాతం పైగా లాభంతో ఉంది. కోల్‌ ఇండియాలో కొనుగోళ్ళ జోష్‌ కొనసాగుతూనే ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు వెలుగులో ఉన్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరల ప్రభావం పెయింట్‌ కంపెనీలపై తీవ్రంగా పడుతోంది. గత కొన్ని రోజులుగా ఏషియన్‌ పెయింట్స్‌ నష్టాల్లోనే ఉంది. ఇవాళ కూడా టాప్‌ లూజర్‌గా నిలిచింది. బ్యాంక్‌ నిఫ్టి షేర్లలో ఒక్క షేర్‌ మినహా మిగిలిన షేర్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి.