For Money

Business News

కొనసాగుతున్న జోరు

ఉదయం నుంచి నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో కొనసాగుతోంది. యూరో మార్కెట్లు డల్‌గా ప్రారంభం కావడంతో స్వల్ప ఒత్తిడి వచ్చినా 17650పైనే కొనసాగుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 123 పాయింట్ల లాభంతో 17657 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్ల ఉత్సాహం యూరప్‌ మార్కెట్‌లో ఏమాత్రం కన్పించలేదు. కొన్ని సూచీలు నష్టాల్లో కూడా ఉన్నాయి. లాభనష్టాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. అయితే అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లోనే కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్‌లో బ్యాంక్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. నిఫ్టి బ్యాంక్‌ సూచీ 1.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌. అపోలో హాస్పిటల్‌ ఇవాళ కూడా దాదాపు రెండు శాతం నష్టంలో ఉండగా, హైదరాబాద్‌కే చెందిన రెయిన్‌బో హాస్పిటల్‌ రూ.31 లాభంతో రూ. 564 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్‌ భారీ కొనుగోళ్ళు వస్తున్నాయి. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత ఇష్యూధరను కంపెనీ షేర్‌ దాటింది.బజాజ్‌ ఫైనాన్స్‌ రూ. 142 లాభపడగా, డిక్సన్‌ రూ. 50 లాభంతో ఉంది. ఫలితాలు వచ్చిన తరవాత నిన్న డల్‌గా ఉన్న ఇండియన్‌ హోటల్స్‌ ఇవాళ రూ. 9 లాభపడటం విశేషం.