For Money

Business News

ట్రస్ట్‌ నిర్వహణలో అంబానీ ఆస్తులు?

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన ఆస్తుల పంపిణీ విషయంలో ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. టాటాలతో పాటు ఇంకా అనేక ప్రముఖ పారిశ్రామిక సంస్థల ఆస్తులన్నీ ట్రస్ట్‌ల పేరున ఉన్న విషయం తెలిసిందే. టాటా గ్రూప్‌ పెత్తమంతా టాటా సన్స్‌ అనే ట్రస్ట్‌ చేతిలో ఉంది. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు ముకేష్‌ అంబానీ. తన ఆస్తులన్నింటిని ట్రస్ట్‌కు బదిలీ చేసి… గ్రూప్‌ కంపెనీల నిర్వహణ పూర్తిగా ప్రొఫెషనల్స్‌ చేతిలో పెట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకు వ్యూహం ఖరారు చేసేందుకు అనేక ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీల సాయం తీసుకుంటున్నారు. ముకేష్‌ అంబానీ, నీతా అంబానీలకు ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈషా, అనంత్‌, ఆకాశ్‌ ఇప్పటికే కంపెనీల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాకాకుండా గ్రూప్‌ నిర్వహణ ప్రొఫెషనల్స్‌ చేతిలో ఉండాలని ముకేష్‌ అంబానీ యోచిస్తున్నారు.