For Money

Business News

సోమాజిగూడలో మలబార్‌ ఆర్టిస్ట్రీ షోరూమ్‌

పసిడి, వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ హైదరాబాద్‌ సోమాజిగూడలో తొలి ‘ఆర్టిస్ట్రీ షోరూమ్‌’ను ఈ నెల 27న ప్రారంభించనుంది. కొంత మంది ఎంపిక చేసిన కస్టమర్లకు ఇప్పటికే ఈ షోరూమ్‌కు ఆహ్వానించి… దీని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. భాగ్యనగర కళా వారసత్వం, చరిత్ర ప్రతిబింబించే ప్రత్యేక డిజైన్‌లతో రూపొందించిన ఆభరణాలు ఈ షోరూమ్‌లో లభిస్తాయని మలబార్‌ గోల్డ్ తెలిపింది. దేశంలోని అతిపెద్ద షోరూమ్‌ల్లో ఇది తొలి కాన్సెప్ట్‌ స్టోర్‌గా నిలుస్తుందని సంస్థ తెలిపింది. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక హస్తకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన పసిడి, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని వివరించింది. అన్ని వర్గాల వినియోగదారులకు ప్రత్యేక ఆభరణాలు అందించే విధంగా ఆర్టిస్ట్రీ స్టోర్‌ను రూపొందించినట్లు మలబార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ తెలిపారు. విభిన్నమైన డిజైన్స్‌తో బంగారం, డైమండ్స్‌, ప్లాటినం నగలను ఇక్కడ విక్రయించనున్నట్లు తెలిపారు.