For Money

Business News

ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌తో కేటీఆర్‌ భేటీ

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాలంటూ తైవాన్‌కు చెందిన ఎల‌క్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ తెలంగాణ ప‌రిశ్రమ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. త‌న కంపెనీకి చెందిన ప్రతినిధి బృందంతో క‌లిసి హైద‌రాబాద్ వ‌చ్చిన లియూ మంత్రి కేటీఆర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, డిజిట‌ల్ హెల్త్‌, ఎల‌క్ట్రానిక్స్‌, రోబోటిక్స్‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ‌లో ప‌రిశ్రమ‌ల స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహ‌కాలు త‌దిత‌రాల‌ను కేటీఆర్ ఫాక్స్‌కాన్ బృందానికి కేటీఆర్‌ వివ‌రించారు.