For Money

Business News

హీరో బైక్‌ల ధర పెంపు

బైక్‌లు, మోటర్‌ సైకిల్స్‌ ధరలను పెంచాలని హీరో మోటోకార్ప్‌ నిర్ణయించింది. గరిష్ఠంగా ఒక్కో వాహనం ధరను రూ.3000 వరకు పెంచనున్నారు. మోడల్‌ను బట్టి ధరను పెంచినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ధరలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ముడి పదార్థాల ధరలు క్రమంగా పెరుగుతున్నందున.. అందులో కొంత భారం వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. మార్చి నెలలోనే కంపెనీ రూ. 2000 చొప్పున ధరలను పెంచిన విషయం తెలిసిందే.