For Money

Business News

దేశ వ్యాప్తంగా మైక్రో ఏటీఎంలు

అన్ని బ్యాంకుల ఖాతాదారులు డెబిట్‌ కార్డుతో నగదు విత్‌డ్రా చేసుకునేలా మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. ఖాతాలో నగదు నిల్వ తెలుసుకునే వెసులుబాటు కూడా ఈ ఏటీఎంలలో ఉంటుంది. మైక్రో ఏటీఎంలను నిర్వహించేందుకు కిరాణా దుకాణదారులను బిజినెస్‌ కరస్పాండెంట్లుగా నియమించుకుంటున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. 8 ప్రధాన మెట్రో నగరాల శివార్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. పండుగల వేళ 6.50 శాతం వడ్డీరేటుపై గృహరుణం, 10.25 శాతంపై వ్యక్తిగత రుణం, టూవీలర్స్‌ రుణాలను 16.49 శాతానికి అందిస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.