For Money

Business News

జియోబుక్‌… నిరాశ

రిలయన్స్‌ ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జియోబుక్‌ పట్ల నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆధునాత జియోఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌ట్యాప్‌ను జియో ఇవాళ మార్కెట్‌లో విడుదల చేసింది. 990 గ్రాముల బరువు ఉన్న ఈ ల్యాప్‌ట్యాప్‌ 4జీ ఎల్‌టీసీ సిమ్‌తో వస్తోంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఫ్లాష్‌ మెమరీతో వచ్చిన ఈ ల్యాప్‌ ట్యాప్‌ మెమరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. 11.6 ఇంచీల హెచ్‌డీ డిస్లే ఉన్న ఈ జియో బుక్‌ను రూ. 16499లకు అందిస్తున్నట్లు జియో పేర్కొంది. అయితే ఈ కాన్ఫిగరేషన్‌.. ఇంతకన్నా మంచి లాప్‌ట్యాప్‌లు వస్తున్నాయని చాలా మంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి జియో నుంచి మరో ప్రొడక్ట్‌ అంచనాలకు భిన్నంగా నిరాశకల్గించిందని చెప్పొచ్చు.