For Money

Business News

22న టాటా టెక్‌ ఐపీఓ ప్రారంభం

ఇన్వెస్టర్లు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న టాటా టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానుంది. ఆఫర్‌ ఈనెల 24వ తేదీన ముగుస్తుందని కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద ప్రమోటర్లు తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు. అంతే కొత్త ఈక్విటీ ఉండదన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ అన్నమాట. ఆఫర్‌ ధర మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఆఫర్‌ ధర రూ. 500 ప్రాంతంలో ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీలో టాటా హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌కు 74.42 శాతం వాటా ఉంది. టాటా గ్రూప్‌ నుంచి దాదాపు 20 ఏళ్ళ తరవాత ఓ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందించే ఈ కంపెనీ ప్రధాన కస్టమర్లు టాటా మోటార్స్‌, జేఎల్‌ఆర్‌. ఇటీవల ఎడ్యుకేషన్‌ రంగంలోకి కూడా విస్తరించింది.