For Money

Business News

ఐపీఎల్ బ్రాండ్‌ వ్యాల్యూ జూమ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) బ్రాండ్‌ వ్యాల్యూ 2023లో 28 శాతం పెరిగింది. ప్రస్తుతం ఐపీఎల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ 1070 కోట్ల డాలర్లు (సుమారు రూ. 89,000 కోట్లు) అని బ్రాండ్‌ వ్యాల్యూయేషన్‌ సంస్థ డీ అండ్‌ పీ అడ్వయిజరీ పేర్కొంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ ఇప్పటి వరకు 433 శాతం పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఐపీఎల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ 1000 కోట్ల డాలర్లు దాటిందని లెక్క గట్టిన రెండో సంస్థ ఇది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ హౌలిహాన్‌ లాకీ కూడా ఐపీఎల్‌ బ్రాండ్‌ వ్యాల్యూ 300 కోట్లను, బిజినెస్‌ ఎంటర్‌ప్రైజస్‌ వ్యాల్యూ 15000 కోట్ల డాలర్లని ఈ సంస్థ వెల్లడించింది.