For Money

Business News

20 శాతం పెరిగిన ధరలు

రెండు నెలల క్రితమే ధరలను పెంచిన హిందుస్థాన్‌ యూని లీవర్‌ మళ్ళీ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. చాలా రోజులు ధరలు పెంచకుండా… ప్యాకెట్‌ సైజు అలాగే ఉంచి… లోపల గ్రాములు తగ్గిస్తూ వచ్చిన హిందూస్థాన్‌ లీవర్‌ గత నవంబర్‌లో ధరలను పెంచింది. ముడి చమురు ధరలతో సహా ముడి పదార్థాల ధరలు పెరగడం, రవాణా చార్జీలు భారీగా పెరగడంతో దాదాపు తాను తయారు చేసే చాలా వరకు ఉత్పత్తుల ధరలను 20 శాతం దాకా పెంచింది. రిన్‌ సబ్సు, సర్ఫ్‌ ఎక్సెల్‌, లైఫ్‌బాయ్‌, పియర్స్‌ వంటి సబ్సుల ధరలను పెంచింది. హిందుస్థాన్‌ లీవర్‌ ధరలను పెంచడంతో ఇక ఇతర కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతాయిన మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ముడిపదార్థాల ధరలు గణనీయంగా పెరిగినందున ఎఫ్‌ఎంసీజీ వస్తువుల ధరలు పెంచక తప్పడం లేదని ఆల్‌ ఇండియా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్‌ పాటిల్‌ తెలిపారు.