For Money

Business News

గుంటూరులో ఐటీసీ హోటల్‌ ప్రారంభం

గుంటూరులో ఐటీసీ నిర్మించిన ‘వెల్ క‌మ్ హోటల్’ను ఇవాళ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. గుంటూరు నగరంలో ఫైవ్‌స్టార్‌ హోటల్ రావడం, ఆ హోట‌ల్‌లో ఐటీసీకి భాగస్వామ్యం కావడం శుభ ప‌రిణామమ‌ని అన్నారు. ఐటీసీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయరంగంలో ప్రత్యేకంగా పుడ్‌ ప్రాసెసింగ్‌లో ముందుకు వెళ్తోంద‌ని తెలిపారు. గుంటూరులో ఇవాళ ప్రారంభమైన హోట‌ల్ ఆంధ్రప్రదేశ్‌లో తొలి లీడ్‌ ప్లాటినం సర్టిఫైడ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అని అన్నారు. ఐటీసీతో మరింత దృఢంగా, పెద్ద ఎత్తున ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంద‌ని జ‌గ‌న్ అన్నారు. ప్రధానంగా పర్యాటక రంగం, వ్యవసాయ రంగం, పుడ్‌ ప్రాససింగ్‌ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యులం అవుతామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్ పూరి పాల్గొన్నారు.