For Money

Business News

సత్యం రామలింగరాజుకు షాక్‌

సత్యం రామలింగరాజుకు సత్యం స్కామ్‌ వివాదం వీడటం లేదు. తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ (PwC) దాఖలు చేసిన పిటీషన్‌ ఇపుడు ఆయనకు తలనొప్పిగా మారింది. తమ సంస్థ ఇమేజీని దెబ్బ తీశారంటూ రామలింగరాజుతో పాటు మరికొందరిపై రూ. 223 కోట్ల పరిహారం కోరుతూ హైదరాబాద్‌ సివిల్ కోర్టులో PwC పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను సవాలు చేస్తూ రామలింగరాజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సిటీ కోర్టులో ఆయనపై దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ త్వరలోనే ప్రారంభం కానుంది.