For Money

Business News

టీసీఎస్‌ సీఈఓ రాజీనామా

దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపీనాథ్‌ రాజీనామా చేశారు. సెప్టెంబర్‌ 15 తరవాత గోపీనాథ్‌ రాజీనామా అమల్లోకి వస్తుంది. గోపీనాథ్‌ స్థానంలో కొత్త సీఈఓ, ఎండీగా కృతి వాసన్‌ను నియమించారు. గోపీనాథ్‌ వైదొలగిన తరవాత కృతివాసన్‌ నియామకం అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. గత మూడు ఏళ్ళుగా కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించడం లేదు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తంగా ఐటీ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.