For Money

Business News

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా: తగ్గిన నష్టం

మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.128.95 కోట్ల నష్టాన్ని జీఎంఆర్‌ ఇన్‌ ఫ్రా ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలను రూ.594.41 కోట్ల మేర తగ్గించుకోగలిగినట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం రూ.1,697.71 కోట్ల నుంచి రూ.1,386.96 కోట్లకు పడిపోయింది. కంపెనీ ఖర్చులు రూ.1,361.28 కోట్ల నుంచి రూ.1,537 కోట్లకు చేరాయి. రెండు కొవిడ్‌ ఉధృతులు, విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా పని తీరు మెరుగుపరుచుకున్నట్టు కంపెనీ తెలిపింది.