For Money

Business News

EPF వడ్డీ రేటు స్వల్పంగా పెంపు

ఈపీఎఫ్‌పై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచనున్నారు. 2022-23 ఏడాదికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు అంటే
2021-22 ఏడాదికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.10 శాతం చెల్లిస్తున్నారు. కొత్త వడ్డీ రేట్లను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ నిర్ణయించిందని, ఆర్థిక శాఖ నోటిఫై చేసిన వెంటనే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని పీటీఐ పేర్కొంది.