For Money

Business News

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేందర్ ఫడ్నవీస్‌ అన్నారు. గవర్నర్‌ కోషియారీని కలిసిన తరవాత ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. షిండే ప్రభుత్వానికి తాము బయటి నుంచి మద్దతు ఇస్తామని దేవేందర్‌ ఫడ్నవీస్‌ అన్నారు. బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని… హిందుత్వ అజెండాను ఉద్ధవ్‌ థాకరే పక్కన పెట్టారని ఫడ్నవీస్‌ ఆరోపించారు. థానేలో ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన ఏక్‌నాథ్‌ షిండే ఇపుడు సీఎం స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షిండే… శివసేనను చీల్చడంలో కీలక పాత్ర పోషించారు.