For Money

Business News

ఈ ముద్రా లిస్టింగ్‌…అపుడే అమ్మకాలు

ఈ-ముద్రా కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యాయి. ఈ షేర్‌ను కంపెనీ రూ. 256కు ఆఫర్‌ చేయగా, ఇవాళ 6 శాతం ప్రీమియంతో రూ. 271 వద్ద లిస్టయింది. ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి రావడంతో లిస్టింగ్‌ ధరకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 256.25ని తాకిన తరవాత ఇపుడు రూ. 261 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌ స్థిరంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్‌ ప్రీమియంతో ఉంది. మరి ఇవాళ చివరి వరకు ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి.