ఏఐ విభాగంలో 50,000 మంది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సి ఎంఎల్ సొల్యూషన్స్ కోసం తమ కంపెనీలో 50,000 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు టీసీఎస్ పేర్కొంది. దీర్ఘకాలానికి కంపెనీ పనితీరు మెరుగ్గా ఉంటుందని… స్వల్ప కాలానికి తాము అంచనా వేయలేమని టీసీఎస్ పేర్కొంది. మళ్ళీ డిమాండ్ ఎపుడు పుంజుకుంటుందో చెప్పడం కష్టమని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రెండంకెల వృద్ధి సాధించడం చాలా కష్టమైన పని అని పేర్కొంది. అలాగే క్లయింట్లతో ఉన్న డీల్స్ రద్దు కావడం లేదని తెలిపింది. మార్జిన్ను 26-28 శాతం ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికాలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు ఎలాంటి సమస్యలు రాలేదని స్పష్టం చేసింది.