For Money

Business News

డిష్ టీవీ తీర్మానాలు ఇవే…

సెబి ఆదేశాల మేరకు గత డిసెంబర్‌ 30న జరిగిన కంపెనీ సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) వివరాలను డిష్‌ టీవీ ఇవాళ బయట పెట్టింది. ఏజీఎం వివరాలను స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పంపింది. దీని ప్రకారం ఆ నాటి సమావేశంలో కంపెనీ ప్రతిపాదించిన మూడు తీర్మానలను వాటాదారులు తిరస్కరించారు. అశోక్‌ మథాయ్‌ కురియన్‌ను మళ్ళీ కంపెనీ ఆడిటర్‌గా నియమించడం తొలి తీర్మానం కాగా, కంపెనీ స్టాండ్‌ అలోన్‌, కన్సాలిడేటెడ్‌ ఆర్థిక ఫలితాలను ఆమోదించడం రెండో తీర్మానం. ఆడిటర్‌కు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్‌కు ఆమోదం కోరుతూ మూడో తీర్మానాన్ని ఆ నాటి సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ మూడు తీర్మానాలను ఏజీఎంలో వాటాదారులు తిరస్కరించారు. తీర్మానానికి అనుకూలంగా 21.05 శాతం ఓట్లు రాగా, 78.94 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.