For Money

Business News

ఐపీఓకి డెల్టా టెక్‌ గేమింగ్‌

డెల్టా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ డెల్టా టెక్‌ గేమింగ్ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు రానుంది. ఈ మేరకు సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. రూ.300 కోట్లను కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా సమీకిరస్తారు. అలాగే ప్రమోటర్లు తమ వద్ద ఉన్న షేర్లను అమ్మడం ద్వారా రూ.250 కోట్లు సమీకరిస్తారని తెలుస్తోంది. ఇలా పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా కంపెనీ రూ. 550 కోట్లను సమీకరించనుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో డెల్టా కార్పొరేషన్‌ ఉద్యోగులకు, డెల్టాటెక్‌ ఉద్యోగులకు రిజర్వేషన్‌ ఉంటుంది. పబ్లిక్‌ ఆఫర్‌లో కేవలం 10 శాతం షేర్లను మాత్రమే రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేస్తారు.