For Money

Business News

మాగుంట నివాసంలో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం స్కామ్‌ విచారణలో భాగంగా వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలోని ఆయన ఆఫీసుతో పాటు నెల్లూరులోని ఆయన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ఆయన కంపెనీలపై కూడా దాడులు జరుగుతున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ మద్యం రిటైల్‌ షాపుల్లో మాగుంట కంపెనీలకు వాటా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు చెందిన కంపెనీలపై దాడులు జరుగుతున్నాయి.