For Money

Business News

సైయెంట్‌ లాభం 116 కోట్లు

హైదరాబాద్‌కు చెందినసైయెంట్‌ కంపనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపరిచాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.116.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాదిలో గడించిన లాభంతో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగింది. ఆదాయం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 18 శాతం పెరిగి రూ.1,250 కోట్లకు చేరింది. గడిచిన త్రైమాసికంలో 42.42 కోట్ల డాలర్ల విలువైన ఆరు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సైయెంట్‌ సీఈవో, ఎండీ కృష్ణ బొడనపు తెలిపారు. గత త్రైమాసికంలో బలమైన వృద్ధిని సాధించినట్లు, కమ్యూనికేషన్స్‌, మైనింగ్‌, హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, ఆటోమోటివ్‌ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడంతో ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు.