అడ్వెంట్ చేతికి సువేన్ ఫార్మా
మార్కెట్ ఊహాగానాలు నిజమయ్యాయి. హైదరాబాద్కు చెందిన సువేన్ ఫార్మాలో ప్రమోటర్లు జాస్తి వెంకటేశ్వర్లు కుటుంబానికి ఉన్న వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో జాస్తి కుటుంబానికి 60 శాతం వాటా ఉంది. ఇది లిస్టెడ్ కంపెనీ. గత శుక్రవారం ఎన్ఎస్ఈలో షేర్ ముగింపు ధరతో పోలిస్తే కంపెనీ మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ. 12682 కోట్లకు చేరింది. ఈ డీల్కు సంబంధించిన ఒప్పందం ఇవాళ జరిగే అవకాశముంది. నెల రోజుల క్రితమే కొహన్స్ లైఫ్ సైన్సస్ అనే కంపెనీని అడ్వెంట్ ఇంటర్నేషనల్ నెలకొల్పింది. ఈ కంపెనీ ద్వారా సువేన్ ఫార్మాను కొనుగోలు చేయనున్నారు. తరవాత ఈ రెండు కంపెనీలను విలీనం చేస్తారని తెలుస్తోంది. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యూఫాకర్చరింగ్ రంగలో సువేన్ ఫార్మా ఉంది. సువన్ ప్రమోటర్లు జాస్తి కుటుంబానికి సువేన్ లైఫ్ సైన్సస్ అనే మరో లిస్టెడ్ కంపెనీ ఉంది.