For Money

Business News

రూ. 428 కోట్లు ఎగ్గొట్టిన మరో కంపెనీ

ముంబైకు చెందిన పీఎస్‌ఎల్‌ గ్రూప్‌ కంపెనీకి చెందిన స్థావరాలపై ఇవాళ సీబీఐ దాడులు నిర్వహించింది. కెనరా బ్యాంకుకు రూ. 428.50 కోట్ల రుణలను ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. ముంబైతో పాటు గుజరాత్‌లోని కచ్‌లో కూడా దాడులు జరిగాయి. కంపెనీ డైరెక్టర్లు అశోక్‌ యోగిందర్‌ పుంజ్‌, అలోక్‌ యోగిందర్‌ పుంజ్‌, రాజేంద్ర కుమార్‌ బహ్రాజ్‌, చిత్రంజన్‌ గోయెల్‌తో పాటు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2009 నుంచి 2016 మధ్య కాలంలో కెనరా బ్యాంక్‌ నుంచి వివిధ రుణ సౌకర్యాలు పొందిన ఈ కంపెనీ రూ. 428.50 కోట్ల మోసానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. తీసుకున్న నిధులను ఉద్దేశించిన పనుల కోసం వినియోగించలేదని, పుస్తకాలను కూడా తారుమారు చేశారని సీబీఐ వెల్లడించింది.