మార్కెట్లోకి బ్రిజా కొత్త మోడల్
బ్రెజా మోడల్ కొత్త వెర్షన్ను మార్కెట్లో ప్రవేశ పెట్టి మారుతీ సుజుకి. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభించనున్నది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ మోడల్ ధక రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్య ఉంటుంది. ఎస్యూవీ సెగ్మెంట్లో మరింత విస్తరించేందుకు ఈ కొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు కంపెనీ ఎండీ, సీఈవో హిసాషి టకెచీ తెలిపారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆరు వాహనాలను విడుదల చేసినట్లు, దేశీయ మార్కెట్పై తమకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అటు డిజైన్, టెక్నాలజీ, నూతన ఫీచర్స్తో వాహన రూపకల్పన చేస్తున్నట్లు, కొనుగోలుదారులు కోరుకుంటున్న విధంగా కంఫర్ట్గా ఉండేటట్టు డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మోడల్ లీటర్కు 20.15 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. హ్యుందాయ్కి చెందిన వెన్యూ, కియాకు చెందిన సోనెట్లకు పోటీగా సంస్థ ఈ మోడల్ మారుతీ ప్రవేశపెట్టింది.