For Money

Business News

దొడ్ల డెయిరీలో భారత్‌ బయోటెక్‌ పెట్టుబడి

హైదరాబాద్‌కు చెందిన దొడ్ల డెయిరీలో వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ భారత్‌ బయోటెక్‌ భారీ పెట్టుబడి పెట్టింది. దొడ్ల డెయిరీలో 3.39 శాతం వాటాను రూ.106.38 కోట్లకు భారత్‌బయోటెక్ కొనుగోలు చేసింది. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఈ పెట్లబడి పెట్టింది. ఒక్కో షేర్‌నురూ. 525 చొప్పున టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌ నుంచి 18,31,434 షేర్లను, కంపెనీ ప్రమోటర్ల ఒకరైన సునీల్‌ రెడ్డి దొడ్ల నుంచి 1,95,000 షేర్లను భారత్‌ బయో కొనుగోలు చేసింది. ఈ మొత్తం షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసింది. నిన్న దొడ్ల డెయిరీ షేర్‌ 1.93 శాతం లాభంతో రూ. 530 వద్ద ముగిసింది.